18 July, 2026 | 6:56 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

మా గ్రామానికి రేషన్ షాప్ మంజూరు చేయండి

15-09-2025 08:58 PM

గారకుంట తండా గ్రామస్తుల వినతి

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని గారకుంట తండా గ్రామానికి నూతన రేషన్ దుకాణాన్ని మంజూరు చేయాలంటూ సోమవారం హుజూర్‌నగర్ ఆర్డిఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.గార కుంట తండా గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీ అయినప్పటికీ ఇప్పటివరకు రేషన్ దుకాణం మంజూరు కాలేదని గ్రామానికి చెందిన బానోతు రమేష్ నాయక్, గుగులోతు బాలకృష్ణలు తెలిపారు. గ్రామంలో 350కు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని సుమారు 2000 మంది జనాభా కలిగి ఉన్న గ్రామపంచాయతీకి రేషన్ షాపు లేకపోవడం బాధాకరమని తెలిపారు.

ప్రస్తుతం పరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న రేషన్ షాపుకు వెళ్లి గ్రామస్తులు బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.గారకుంట తండా గ్రామం నుంచి పర్రెడ్డిగూడెం గ్రామానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదని దీంతో రేషన్ సరుకుల కోసం గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.గిరిజనుల పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులు వెంటనే రేషన్ షాప్ మంజూరు చేయాల్సిందిగా వారు కోరారు.