12-06-2025 06:40:49 PM
మంచిర్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ రవీంద్రభారతీలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి(Vasundara vignana vikasa mandali) 32వ వార్షికోత్సవంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ కి సామాజిక సేవ స్పూర్తి పురస్కారం అవార్డు లభించింది. మాల కమ్యూనిటీలో కొనసాగుతూ పేదవారికి తన వంతుగా సహాయం చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో 25 సంవత్సరాలుగా నిర్వీరామంగా పని చేస్తున్న సుధీర్ కి వసుంధర విజ్ఞాన వికాస మండలి జ్యూరి కమిటీ గుర్తించి స్పూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ముఖ్యఅతిథుల చేతుల మీదుగా స్పూర్తి పురస్కారాన్ని సుధీర్ అందుకున్నారు.