15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సైన్యం కదలికల ఫొటోలు తీయొద్దు

10-05-2025 12:23 AM

భారత్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ దేశ పౌరులకు ఒక ముఖ్య సందేశాన్నిచ్చారాయన.

ఈ సున్నితమైన సమయం లో ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు. ‘మన దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్న ధైర్యవంతులైన మన భారతీయ సాయుధ బలగాలకు వందనం. వారి ధైర్యం స్ఫూర్తితో, శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి మనం ఒక దేశంగా కలిసి నిలబడదాం.

మీరు భారత సైన్యం కదలికలను చూస్తే ఫొటోలు, వీడియోలను తీయడం షేర్ చేయడం వంటివి చేయొద్దు. ఇలా చేస్తే మీరు శత్రువుకు సహాయం చేసినట్టే అవుతుంది. ధ్రువీకరించని వార్తల్ని, పుకార్లను ఫార్వర్డ్ చేయడం ఆపండి. ప్రశాంతంగా, అప్రమత్తంగా, సానుకూలంగా ఉండండి. విజయం మనదే’ అని రాజమౌళి రాసుకొచ్చారు.