15 April, 2026 | 12:08 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

కలెక్షన్లలో కొంత మొత్తాన్ని సైనికులకిస్తాం

10-05-2025 12:23 AM

భారత్ మధ్య చోటుచేసుకున్న తాజా పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ విరాళాన్ని ప్రకటించారు. తమ బ్యానర్‌లో తెరకెక్కి, శుక్రవారం విడుదలైన ‘సింగిల్’ చిత్రబృందంతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సినిమా కలెక్షన్లలో కొంత భాగాన్ని సైనికులకు అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్ పెట్టాం.

ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాం. సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరన్న ధైర్యంతో సినిమాను విడుదల చేశాం’ అని అరవింద్ వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకానాయికలు శ్రీవిష్ణు, ఇవానా, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు. 

సైన్యానికి ‘దేవరకొండ’ విరాళం ప్రకటన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న 

పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పేందుకు భారత సైన్యం ముందడుగు వేస్తోంది. ఇలాం టి సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవర కొండ.

రాబోయే కొన్ని వారాలపాటు తన క్లాత్ బ్రాండింగ్ ‘రౌడీ వేర్’ అమ్మకాల్లో వచ్చే లాభాల్లో కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వనున్నట్టు విజయ్ ప్రకటించారు. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు రౌడీ హీరో.