22-05-2025 07:35:17 PM
దాత దుబ్బా ప్రభాకర్, సరిత దంపతులకు అభినందనలు..
కోదాడ: కోదాడ వాస్తవ్యులు దుబ్బా ప్రభాకర్, సరిత దంపతులు వారి బావమరిది జ్ఞాపకార్థం హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా కోదాడ శివారు ప్రాంతమైన శ్రీ గుంటి రఘునాథ స్వామి దేవాలయంలో 800 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమంనకు 30 వేల రూపాయలు విలువ కలిగిన బియ్యం, కూరగాయలు, కిరాణ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ సరిత దంపతులను ఆలయ చైర్మన్ గుడుగుంట్ల రంగయ్య శాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందించారు.
తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని చైర్మన్ గుడుగుంట రంగయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సేకు శ్రీనివాసరావు, వెనేపల్లి శ్రీనివాస రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గెల్లా లక్ష్మీనారాయణ, కొమరగిరి రంగారావు, ఆలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల రాఘవా చార్యులు, దాత కుటుంబ సభ్యులు బాబురావు, పద్మ, భారతి వెంకటనారాయణ, కళావతి, నాగలక్ష్మి, పిల్లలు పద్మావతి, రాహుల్, కార్తీక్, ఋత్విక్ పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.