calender_icon.png 23 May, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌టీ సర్వీసుల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం

22-05-2025 07:32:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): వినియోగదారుల హెచ్‌టీ 11 కెవి, 33 కెవి ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టామని నిర్మల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం(Circle Superintending Engineer B. Sudarshanam) తెలిపారు. గురువారం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హెచ్‌టీ 11 కెవి, 33 కెవి, ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్‌టీ మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 11 కెవి వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏడిఈ  కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని, అలాగే 33 కెవి వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏడిఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు. 

ఈ సింగిల్  విండో  కొత్త విధానం వలన మొదట వినియోగదారులు TGNPDCL పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో HT దరఖాస్తులు (టీజీ ఐపాస్ లో నమోదు కానటువంటివి) నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్(UID) ఉత్పన్నమవుతుంది. అలా వచ్చిన కొత్త దరఖాస్తులు TGNPDCL యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది. ప్రతిరోజూ ఏడిఈ కమర్షియల్‌లు అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తూ ఉంటారు. 

దరఖాస్తు  నమోదు చేసుకున్న తర్వాత  11 కెవి, 33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని, ఏడిఈ/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారు. 33 కెవి, ఆ పై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారు. ఇక 33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు అయితే, ఆన్‌లైన్‌లో సంబంధిత CE/కమర్షియల్ & RAC/TG TRANSCO కి ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుంది. 11 కెవి వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్‌లోడ్ చేయబడుతుంది.

వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు రిమార్క్‌లు వినియోగదారునికి SMS రూపేణా పంపబడుతుంది. అలాగే 33 కెవి, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సింగిల్ విండో వ్యవస్థ వలన  త్వరిత గతిన సర్వీసులు మంజూరు అవుతాయని, ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు. దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులు దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు SMS  రూపేణా సమాచారం పంపబడుతుందని వివరించారు.