15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

జాతీయ రక్షణనిధికి నెలజీతం విరాళం

11-05-2025 01:57 AM

- ప్రకటించిన బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పహల్గాం దుర్ఘటనలో అమాయకులను వారి కుటుంబాల ముందే దారుణంగా హత్య చేసిన దృశ్యాలతో దిగ్భ్రాంతి చెందినట్టు బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మన సైన్యం ఉగ్రవాదులను అంతం చేయాలని దేశమంతా కోరుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రక్షణ నిధికి తన ఒకనెల జీతాన్ని నిరంజన్ ప్రకటించారు. సైన్యం దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాదులపై చర్యలను ప్రారంభించిందని వివరించారు. జాతీయ రక్షణనిధికి విరాళాలు, ఇతర అన్నిమార్గాల ద్వారా మన సైన్యానికి మద్దతుగా నిలబడటం ప్రతీ పౌరుడి విధి అని పిలుపునిచ్చారు.