calender_icon.png 31 May, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నల బాధలు పట్టవా..?

27-05-2025 12:35:43 AM

ప్రజావాణిలో మొలకెత్తిన ధాన్యంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్

నిజామాబాద్, మే 26, (విజయ క్రాంతి): ఇటీవల కురిసిన వర్షాలకి ధాన్యం మొలకలు ఎత్తిందని కళ్ళల్లో నీ ధాన్యం ఆరవసిన ధాన్యం తడిసి ముద్దయిందని తడిసిన ధాన్యాన్ని వెంటనే కనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలిసి అభ్యర్థించారు. తడిసి మొలకెత్తిన ధాన్యం తో పాటు రైతులు బిజెపి నాయకులు అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి చేరుకున్నారు.

సోమవారం ఉదయం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు మొలకెత్తిన ధాన్యం సంచిలో నుండి తీసి చూపిస్తూ రైతులను ఆదుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును దినేష్ కులచారి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం తడిసి నష్టపోయిన నిజామాబాద్ జిల్లా రైతులతో బిజెపి అధ్యక్షులు దినేష్ కులాచారి రైతులు బీజేపీ నాయకుల తో కల్సి కలెక్టర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. ఇందూరు జిల్లాలో  8,60,000 వేలు మాత్రమే వడ్లు కొనుగులు జరిగింది అన్నారు ఇంకా 3 లక్షల పై చిలుకు వడ్లు కొనుగులు చేయక పోవడంతో ధాన్యం తడిసి ముద్దయి రైతులు ఇబ్బంది పడుతున్నారని దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

మే నెల లో అకాల వర్షనికి ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగులు చేయక వడ్లు మొల్కత్తి దెబ్బ తింటున్నాయి అని సొంతంగా రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తిరస్కరించడం పై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందనీ ‘రైతన్న పండించిన ధాన్యం మొలకెత్తిన వడ్లను ప్రభుత్వ అధికారులు తీసుకోకపోవడం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని తిరిగి పంపడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు అని రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధాన్యం విషయమై ప్రభుత్వం చేతులెత్తేయడం మానుకుని, తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలి. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం‘ అని దినేష్ కులచారి హెచ్చరించారు. ఆరుకాలం కష్టపడి పండించిన దాన్యం మొలకెత్తి రైతులు దిక్కుతో స్థితిలో ఉన్నారని అధికారులు ఏ మేరకు ధాన్యం నష్టపోయిందో నివేదికను తయారు చేసే ప్రభుత్వానికి పంపాలని ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీకి వచ్చిన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ధాన్యం  మొలకెత్తి పెట్టిన పెట్టుబడి చేతికి రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని.  రైతన్న ల కు ఆదరణ కరువైందన్నారు.  ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి,కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హరీష్ రెడ్డి, శంకర రెడ్డి, నాయిడి రాజన్న, జనార్దన్ రెడ్డి, బొబ్బిలి వేణుగోపాల్,గిరి,అమందు విజయ్ కృష్ణ,శివునూరి భాస్కర్,శ్రీధర్ గుప్తా,మఠం పవన్, ఆనంద్, దొంతు రవి తదితరులు పాల్గొన్నారు.