30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఆగస్టు 4న డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్

01-08-2024 12:05 AM

మనిషి తనలోని ఆలోచనలతోనే పిచ్చోడయిపోయే పరిస్థితులున్నాయి ఈ రోజుల్లో. అలాంటిది ఒక వ్యక్తి మెదడులోకి మరో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకాలను ఎక్కిస్తే ఆ మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ ఎలా ఉంటుందో మా సినిమాలో చూడండి అంటున్నారు కథానాయకుడు రామ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి తన పాత్రకు డబ్బింగ్‌ని పూర్తి చేశారు హీరో రామ్.

సినిమాలోని “మామా.. మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు” అనే డైలాగ్ చెబుతున్న వీడియోతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఈ విషయాన్ని తెలిపారాయన. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయిక. మణిశర్మ స్వరకల్పనలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆగస్టు 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు నిర్మాణ వర్గాలు తాజాగా తెలిపాయి.