24-12-2025 04:04:45 PM
అడ్డాకుల: పంచాయతీ అధికారి (డీపీఓ) డి నిఖిల శ్రీ బుధవారం అడ్డాకుల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనుల వివరాలు అడిగి తెలుసుకుని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొక్కల పల్లి దశరథ రెడ్డి డిపిఓ నిఖిల శ్రీ కు పూల బొక్కెను ఇచ్చి ఆహ్వానించారు. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనుల అభివృద్ధి చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ , పంచాయతీ కార్యదర్శి, సరస్వతి, విజయ్ మోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి షఫీ, బుచ్చన్న, పాల్గొన్నారు.