24-12-2025 04:31:40 PM
భైంసా,(విజయక్రాంతి): బైంసా పట్టణం చెందిన తెలంగాణ రచయితల ఫోరం జిల్లా అధ్యక్షులు పుండలి రావు రచించిన తెలంగాణ ఉద్యమకారుల పుస్తకాన్ని బుధవారం డిసిసి మాజీ అధ్యక్షులు శ్రీహరి రావు ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల చరిత్రను ఈ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ స్థానిక నాయకులు ఉన్నారు.