25-06-2025 12:27:03 AM
ములుగు, జూన్24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి నిర్వహిస్తున్న పోలీసు డ్యూటీ మీట్ లో భాగంగా జిల్లా స్థాయి డ్యూటీ మీట్ ను ములుగు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు, పెంపొందించేందుకు .
ఈ డ్యూటీ మీట్ దోహదపడుతుందని తెలిపారు. ఇలాంటి డ్యూటీ మీట్ లను సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి డ్యూటీ మీట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులను కైవసం చేసుకునే విధంగా కష్టపడి తమ ప్రతిభను కనబరచాలని సూచించారు.
ఈ డ్యూటీ మీట్ ల నందు ముఖ్యంగా నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, విఐపి మూమెంట్, యాంటి సబటెజ్ చెక్, డాగ్ స్క్వాడ్ యొక్క పనితనం, ఫింగర్ ప్రింట్స్ పై పరిశోధన, ఫింగర్ ప్రింట్స్ తీయు విధానం, బాంబు డిస్పోజల్ టీం యొక్క విధులు, కంప్యూటర్ పరిజ్ఞానం, నేర స్థలం నందు ఫోటోగ్రఫీ అవాంఛనీయ సంఘటనలు సంభవించినప్పుడు వీడియోగ్రఫీ చేయు విధానం, వీడియోగ్రఫీ ద్వారా నేరస్తులను కనుగొనే విధానం, లాంటి అంశాలలో రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జోనస్ పైకి ఎంపిక చేసి, వారు రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలలో కొన్ని అంశాలు ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వారికి, మరి కొన్ని అంశాలు ఏఎస్ఐ మరియు కానిస్టేబుల్ స్థాయి వారికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎలాంటి సందేహాలు ఉన్న ఉన్నతాధికారులు మరియు అనుభవం ఉన్న అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బి డిఎస్పీ, ములుగు డిఎస్పి రవీందర్, ఇన్స్పెక్టర్లు సురేష్ కుమార్, రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు స్వామి, సంతోష్ కుమార్, తిరుపతి, ఎస్త్స్రలు, ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్, డిసిఆర్బి, బిడి టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.