04-07-2025 09:06:16 PM
అరెస్ట్ చేసి రిమాండు కు తరలిపు
బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్
కామారెడ్డి,(విజయక్రాంతి): పంట డబ్బుల కోసం అత్తను హత్య చేసిన అల్లున్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు బాన్సువాడ రూరల్ సిఐ రాజేష్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్తను హత్య చేసిన అల్లుని వివరాలను వెల్లడించారు. ఈ నెల 3 న మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న జిన్న లక్ష్మి ఇంటికి వస్తుండగా కాపు కాచి అల్లుడు జిన్న బాల్ బాగారాజు కత్తితో మెడపై దాడి చేయడంతో గాయపడిన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిందని సిఐ రాజేష్ తెలిపారు. లక్ష్మి అల్లుడు బాలరాజు కు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా అప్పు తీసుకున్న లక్ష రూపాయలు లక్ష్మీకి ఆమె అల్లుడు ఇవ్వలేదు. జొన్నల డబ్బులను అత్త లక్ష్మీ ఖాతాలో జమ చేయించాడు.
పంటకు సంబంధించిన డబ్బులు ఖాతాలో పడడంతో ఆ డబ్బులు ఇవ్వాలని లక్ష్మి కోరగా అప్పుగా ఇచ్చిన లక్ష రూపాయలు ఇస్తే పంట డబ్బులను ఇస్తానని పేర్కొనడంతో కక్ష పెంచుకున్న బాగరాజు ఈనెల మూడున మధ్యాహ్నం అత్త లక్ష్మీపై దాడి చేసి హత్య చేశాడు. బాధితురాలు కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు. నాగరాజులు శుక్రవారం పట్టుకొని అతని వద్ద నుంచి కమ్మ కత్తి ,మోటార్ సైకిల్, సెల్ఫోన్, మృతురాలి బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో విచారించి ఆధారాలను సేకరించి అత్తను హత్య చేసిన బాగారాజును ఆర్ఎస్టీ చేసి జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆదేశాల మేరకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.
తక్కువ సమయంలో హత్య చేసిన నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన బాన్సువాడ రూరల్ సిఐ రాజేష్, పిట్లం ఎస్ ఐ రాజును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జిన్న రాజు అను వ్యక్తి తన తల్లి అయిన జిన్నా లక్ష్మీ W/o నరేందర్, వయస్సు 50 సంవత్సరాలు, గారు మూడు సంవత్సరాల క్రితం తన అల్లుడు యగు జిన్న బాగరాజునకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చినది, తను ఎన్ని సార్లు అడిగిన తిరిగి ఇవ్వడం లేదు. అయితే బాగరాజు తను పండించిన జొన్నల డబ్బులను తన అత్త అయిన లక్ష్మీ అకౌంటు లో వేయించినాడు. బాగరాజు జొన్నల డబ్బులు అడిగితే తనకు ఇవ్వవలసిన బాకీ కింద జమ కట్టుకుకుంటాను డబ్బులు ఇవ్వను అని లక్ష్మీ అనగా, బాగరాజు తన అత్త పై కక్ష పెంచుకొని ఎలాగైనా తన అత్త లక్ష్మీని చంపాలని పథకం పన్ని, స్కూల్ వంట పని ముగించుకొని ఒంటరిగా వస్తున్న తన అత్తపై కమ్మకత్తితో మెడపై దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేశాడు.
కావున తగు చర్య నిమిత్తం దరఖాస్తు ఇవ్వగా పిట్లం పోలీస్ వారు Cr.No. 108/2025 U/Sec 103(1) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించినారు. ఘటన జరిగిన రోజున నిందితుడు బాగరాజు తన మోటార్ సైకిల్ పై హత్యలో ఉపయోగించిన మారణాయుధం (కమ్మ కత్తి)తో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ కేసులో డీఎస్పీ బాన్సువాడ గారి పర్యవేక్షణలో సీఐ బాన్సువాడ రూరల్ రాజేష్, ఎస్ఐ పిట్లం రాజులు సరియగు ఆధారాలు సేకరించి, నిందితుడి వద్ద నుండి హత్య చేయడానికి ఉపయోగించిన వాటిని సాధీన పరచుకొని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపనైనది. ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి, జుడిషియల్ రిమాండ్ నకు పంపడమైనది.
నిందితుడి వద్ద నుండు స్వాధీనం చేసుకున్న వాటి వివరములు
1.ఒక కమ్మ కత్తి 2. ఒక మోటార్ సైకిల్ 3. ఒక సెల్ ఫోన్ 4. నిందితుడు మృతురాలి బట్టలు, ఇట్టి కేసులో అన్ని ఆధారాలను అతి తక్కువ సమయంలో సేకరించి, నేరస్తుడు బాగరాజు ను అరెస్టు చేసి జూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ రూరల్ సి ఐ రాజేష్, పిట్లం ఎస్ ఐ రాజులను జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అభినందించారు.