calender_icon.png 21 June, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

21-06-2025 04:43:44 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

అదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలను మంజూరు చేసిందని, దాదాపు పనులను తుది దశకు చేరుకున్నాయని, త్వరలో స్మృతి వనాన్ని ప్రారంభిస్తామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. స్తూపం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాడు తెలంగాణ పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అమర వీరుల స్తూపాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలను ఇప్పటికీ ఇంటి స్థలాల పత్రాలు అందించామని తెలిపారు. అమర వీరుల స్తూపాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, రగల్ జెండా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.