calender_icon.png 21 June, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని గంజాయి అక్రమ రవాణ..

21-06-2025 04:42:00 PM

మహారాష్ట్ర టూ తెలంగాణ కి..

కిలో గంజాయితో ఒకరు అరెస్టు 

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): యువతను పట్టిపీడిస్తున్న గంజాయి అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది. గంజాయి అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యమే ఇందుకి కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల చిత్తశుద్ధి లేమి, యువత మనగడకు ప్రమాదంగా మారింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ స్టేట్ కు ఎంతోకాలంగా గంజాయి అక్రమ రవాణా నిరాటకంగా సాగుతోంది. ఈ విషయం పోలీసులకు తెలియంది కాదు. ఫలితంగా యువత గంజాయికి బానిసై తమ జీవితాలను అర్ధాంతరంగానే చిదిమేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పుడప్పుడూ తమ ఉనికి కోసం గంజాయిని పట్టుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే మహారాష్ట్ర  బల్లార్షా నుంచి శనివారం ఓ యువకుడు బెల్లంపల్లిలో కిలో గంజాయితో పట్టుపడ్డాడు.

ఈ సంఘటన గంజాయి అక్రమ రవాణాను మరోసారి గుట్టు విప్పింది. ప్రతిసారి రైలు మార్గంలో రవాణయ్యే గంజాయి ఈసారి బస్సులో రవాణా జరగడం అక్రమ రవాణాలో కొత్తపుంతలకు తెరతీసింది. బెల్లంపల్లి టూ టౌన్ పరిధిలోని కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పోలీసులు ముందస్తు సమాచారంతో మాటు వేసి ఉన్నారు. బస్సులో ఓ యువకుడు గంజాయితో వస్తున్నాడనే సమాచారంతో  ఫైవోర్ బ్రిడ్జిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో రూ. 26 వేల విలువైన కిలో గంజాయితో ఓ యువకుడు సంచి తో బస్సు దిగాడు. బెల్లంపల్లి సీఐ అఫ్జలుద్దిన్, టూ టౌన్ ఎస్సై మహేందర్ సదరు యువకుడి నీ అక్కడే విచారించగా మహారాష్ట్ర బల్లార్షా నుంచి ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసిన్నట్లు వెల్లడించాడు.

అరెస్ట్ అయిన వ్యక్తి బెల్లంపల్లి నివాసి షేకుముజ్జు ఆటో డ్రైవరు అని పోలీసు విచారణలో తేలింది. కాగా మహారాష్ట్ర నుంచి గంజాయి అక్రమ రవాణా ను బెల్లంపల్లిలోని కొంతమంది యువకులు ప్రధాన వృత్తిగా పెట్టుకున్న విషయం విధితమే.  పోలీసులూ ఇలా గంజాయినీ పట్టుకోవడం, అరెస్టు చూపించడం షరా మామూలు అని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు.