15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పార్టీ బలోపేతానికి కృషి

12-10-2025 03:55 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన గౌతమ్‌రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అంబర్‌పేటలోని మహంకాళి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.