17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కిరాణ దుకాణం వెళ్ళిన వృద్ధుడి అదృశ్యం

28-01-2026 09:06 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): కిరాణా దుకాణానికి వెళ్ళిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ చారి తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ,జవహర్ నగర్ లో నివాసముండే నిశాంత్ కుమార్, తన తల్లి మరణించిన తర్వాత, 74 సంవత్సరాల వయస్సు గల తన తండ్రి మహేశ్వర్ దాస్‌ను రెండు నెలల క్రితం తనతో ఉండటానికి బీహార్ నుండి నగరానికి తీసుకువచ్చాడు. ఈ 26 న సోమవారం ఉదయం  తన తండ్రి కాలనీలోని కిరాణా దుకాణానికి వెళ్లడానికి ఇంటి నుండి బయలుదేరాడు మరియు తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.