27-11-2025 07:23:29 PM
గజ్వేల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ములుగు మండలంలోని వంటిమామిడి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టి శిబిరాన్ని జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె. హరిత ఐఏఎస్ పరీశిలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు తెలియజేశారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.