26-06-2025 12:58:42 AM
ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హత్య దినం కు 50 ఏళ్లు
మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు
కరీంనగర్, జూన్ 25 (విజయ క్రాంతి): స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశం ఎప్పుడు మరిచిపోలేని రోజు, ప్రజాస్వామ్యానికి సం కెళ్లు వేసి చీకటి అధ్యాయానికి తెరలేపిన రోజు 1975 జూన్ 25 అని, అధికారాన్ని కా పాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాం ధీ జూన్ 25 న ఎమర్జెన్సీ విధించిందని , ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలలపాటు దేశ ప్రజలకు శాపమైందని మా జీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నా రు.
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అ ధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం కరీంనగర్లోని ఈ ఎన్ గార్డెన్స్ లో ఎ మర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు నిర్వహించా రు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మా ట్లాడుతూ ఎమర్జెన్సీ అంటే ఇరవై ఒక్క నెలల నిర్బంధం మాత్రమే కాదు, నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాలవరకూ వినిపించే మనో రోదన ఉందని తెలిపారు.
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలు, వెంటా డే పీడ కలలను గుర్తు చేసుకోవాల్సిన సమయమి దన్నారు. ఇందిరా గాంధీకి పోటీగా నిలబడి ఓడిపోయిన ప్రతిపక్ష అభ్యర్థి రాజ్ నారాయన్ 1975 లో అలహాబాద్ కోర్టులో కేసు దాఖలు చేశారని తెలిపారు.
ఈ కేసు విషయంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆమెను పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించి, ఎన్నికల్లో పాల్గొనకుండా ఆరే ళ్లపాటు నిషేధం విధించారని, ఆ తీర్పును జీర్ణించుకోలేకనే ఇందిరాగాంధీ దేశంలో అ త్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించిందని తెలిపారు. ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వా తంత్రం తో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయని పేర్కొన్నారు.
మీ డియాపై కనివిని ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయని తెలిపారు. అనుమానం వస్తే చాలు ఎంతటి వారైనా ముంద స్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని, విపక్ష నేతలు అందరిని జైలు పాలు చేశారని వివరించారు. ప్రధానంగా ఎ మర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిరా సర్కారు, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఉక్కు పాదం మోపారని, అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జక్షనబుల్ మేటర్ పేరుతో చట్టమే తెచ్చారన్నారు.
డిఫె న్స్ ఆఫ్ ఇండియా రూల్స్ , మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా ) వంటి చట్టాలతో ఎవరినైనా, ఎంతటి వారై నా కటకటాల్లోకి నెట్టారన్నారు. న్యాయ వ్యవ స్థ హక్కులకు కూడా కోతపడిందని , విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కా ర్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేసి దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
దేశంలో 370 ఆర్టికల్ రద్దవుతుంద ని ఎవరు కూడా కలలో కూడా ఉంచలేదని, అలాంటిది మోడీ ప్రభుత్వం చేసిందని, ఇది గొప్ప విషయం అన్నారు. సెప్టెంబర్ 17 వి మోచన దినోత్సవం అధికారికంగా జరగాలన్నారు. నేటి కరీంనగర్ జిల్లా ఒకప్పటి ఎల గందుల జిల్లా పేరుపై ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సదస్సు అనంతరం ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చే సి, జైలు లో గడిపిన కరీంనగర్ ప్రముఖులను సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి మా జీ జిల్లా అధ్యక్షులు బాసు సత్యనారాయణరావు, మాజీ మేయర్ వై సునీల్ రావు, తదితరులుపాల్గొన్నారు.