15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

యాదాద్రిలో ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

31-01-2026 01:40 PM
  1. బంగారు, వెండి డాలర్లు అదృశ్యం
  2. పలువురిని సస్పెండ్ చేసిన ఎ. ఇ. 
  3. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ
  4. జూనియర్ అసిస్టెంట్,రికార్డు అసిస్టెంట్ సస్పెండ్
  5. సూపరిండెంట్లకు చార్జి మెమొలు
  6. సహాయ కార్యనిర్వహణాధికారికి షోకాస్ నోటీసులు జారీ చేసిన ఆలయ ఈవో.

ఆలేరు,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్న బంగారు, వెండి డాలర్లు అదృశ్యమైన ఘటనలో పలువురిని సస్పెండ్ చేసిన ఎ. ఇ, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో చోటుచేసుకుంది, భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు అధిక మొత్తంలో కనిపించకపోవడం, ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసినదే.

ఇట్టి విషయంపై దేవాలయ ఈవో భవాని శంకర్ డాలర్ల అదృశ్యంపై స్పందిస్తూ,  విచారణకు ఆదేశించి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో జారీ చేశారు, ప్రచార శాఖలలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించేందుకు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లు  ఇద్దరినీ విధులనుండి సస్పెండ్ చేశారు. ప్రచారశాఖలో పర్యవేక్షణ లోపం వల్ల విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్లుకు చార్జి మెమొలు జారీ, ఆలయ అధికారులు సహాయ కార్య నిర్వహణ అధికారికి షోకాస్ నోటిలో జారీ చేశారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రతి అధికారికి కఠిన చర్యలు ఉంటాయని ఉద్యోగులను హెచ్చరించారు.