17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జిల్లా ఎస్పీ నితిక పంత్

31-01-2026 03:05 PM

ఏఎసై అశోక్ సేవలు అభినందనీయం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్ఐ ఆర్. అశోక్ ఆత్మీయ పదవీ విరమణ కార్యక్రమాన్ని  శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ... అశోక్ మూడు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. 1989లో కానిస్టేబుల్‌గా చేరి, కష్టపడి పనిచేస్తూ 2018లో ఎ.ఎస్.ఐగా పదోన్నతి పొందడం ఆయన సేవా నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అశోక్ ని శాలువా, జ్ఞాపిక, బహుమతితో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, సి.సి. కిరణ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.