31-01-2026 02:09:42 PM
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై సమాలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు కేసీఆర్ కు సూచించారు. కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలోనే విచారించాలన్న విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. నందినగర్ ఇంట్లోనే అందుబాటులో ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. నిన్నటి నుంచి కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లిలోనే ఉన్న విషయం తెలిసిందే.