calender_icon.png 15 June, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వ్యసనాలకు బానిస కావొద్దు

14-06-2025 12:47:17 AM

  1. మద్యం, డ్రగ్స్, ఆన్లైన్ గేమింగ్ వ్యసనపరులకు నా టీంలో స్థానం లేదు 

ప్రతి విద్యార్థి మంచి నాయకునిగా ఎదగాలి 

మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు 

సిద్దిపేట జూన్ 13 (విజయక్రాంతి): యువత వ్యసనాలకు బానిస కావద్దని, మద్యం, డ్రగ్స్, ఆన్లైన్ గేమింగ్ వంటి వ్యసనపరులకు తన టీంలో స్థానం లేదంటూ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. గురువారం రాత్రి సిద్దిపేటలో జరిగిన బి.ఆర్.ఎస్.వి ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. మీరు నేను ఒక కుటుంబం, మీరంతా నా ఆత్మీయ తమ్ముళ్లుగా భావిస్తున్నట్లు తెలిపారు.

గులాబీ జెండా కోసం మి పటిమ, పట్టుదలను నా గుండెల్లో నిలిచిపోయిందన్నారు. సిద్ధిపేటలో పుట్టిన గులాబీ జెండా రజతోత్సవం  జరుపుకోవాలని గర్వంగా ఉందన్నారు. రజతోత్సవానికి ప్రత్యేకంగా నిలువడానికి సిద్ధిపేట నుండి వరంగల్ వరకు పాదయాత్రగా వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విజయవంతం చేసిన మీకు ఎం చేసిన తక్కువేనని చెప్పారు.

ప్రతి ఒక్కరు లైఫ్ లో సెటిల్ అయ్యి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, ప్రతి మనిషి జీవితానికి దశ, దిశను నిర్దారించే వయస్సు 25-50 ఏళ్ల మధ్య కాలమని సూచించారు. ఎంత సమయం కష్టపడ్డావ్ అనేది బేరీజు వేసుకొని ప్రతి నిమిషం కష్టపడాలన్నారు. ఆన్లైన్ గేమ్స్ తో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, యువత ఈ బెట్టింగ్ భూతానికి దూరంగా ఉండాలనీ కోరారు.

పని చిన్నదా, పెద్దదా అనేది ముఖ్యం కాదనీ ఎదో ఒక పని చేసి ముందుగా జీవితంలో స్థిరపడాలని ఆదేశించారు. సమయం చాలా విలువైనదనీ, ఏ వయస్సులో చెయ్యాల్సింది ఆ వయసులోనే చెయ్యాలనీ చెప్పారు. మీలో ప్రతి ఒక్కరు మంచి నాయకుడు కావాలని, అందుకు తన వంతుగా ఎం    చెయ్యాలో అది చేస్తానని బరోసా ఇచ్చారు. ఇంకో మూడేళ్ళలో వచ్చేది మళ్ళి మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమే, రేవంత్ పాలనలో ఏ ఒక్క స్కీం కూడా అమలు కావడం లేదనీ విమర్శించారు.

రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, వృద్ధులను, యువతను అన్ని వర్గాల ప్రజలను మోసం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ప్రజలకు పాలు ఏందో, నీళ్లు ఏందో అర్ధం అయ్యిందనీ, వాళ్లే ఈ ప్రభుత్వానికి బుద్ధి  చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనీ వెల్లడించారు. అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ రజతొత్సవ సందర్బంగా పాదయాత్ర చేసిన యువ విద్యార్థులను సన్మానించిన జ్ఞాపికా అందజేసి సన్మానించారు.