8 June, 2026 | 9:50 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

నిర్ణీత తేమశాతం ఉండేలా చూడండి

05-11-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మిడ్జిల్, నవంబర్ 4:   పత్తి రైతులు పత్తిని ఆరబెట్టుకుని నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బో యి సూచించారు. మంగళవారం ఆమె మిడ్జిల్ మండ లం రాణిపేట గ్రామంలో ఎంఎస్ పద్భనాభ కాట న్ ఇండస్ట్రీస్ సిసిఐ ద్వారా ఏర్పాటుచేసిన ప త్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమ శాతం 8 నుండి 12 మధ్య వ చ్చిన వెంటనే సిసిఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు..

పత్తిని ఓవర్ లోడ్ లే కుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. మంచు కురుస్తున్నందున పత్తిని ఆరబెట్టుకొని పూర్తిగా ఎండిన తర్వాతే కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ పులి రాజు తదితరులు ఉన్నారు.