1 April, 2026 | 12:28 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

బీఆర్‌ఎస్ పాపాలను దేవుడూ క్షమించడు

06-12-2024 01:50 AM
  1. బీజేపీలో బీఆర్‌ఎస్ కలుస్తుంది 
  2. కేటీఆర్‌కు కనీస జ్ఞానం కూడా లేదు 
  3. టీజీఎండీసీ చైర్మన్ ఈరావత్రి అనిల్‌కుమార్  

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పాపాలను దేవుడు కూడా క్షమించడని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్‌కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల వరకు బీఆర్‌ఎస్ ఉంటదో, గంగల కలుస్తుందో లేదా బీజేపీలో కలుపుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించా రు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్ నుంచి అధికారం గుంజుకోవాలని బావాబామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ దుర్గార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారం కోల్పోయా క కూడా వాళ్లకు బుద్ది, జ్ఞానం లేకుం డా పోయిందని ఎద్దేవా చేశారు. రోజూ ఏదో అయినట్లు రోడ్డుమీద పడి హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంత్రిగా పనిచేసిండా? సినిమా వాళ్లతో తిరిగాడా? అని అనుమానపడాల్సి వస్తుందని అనిల్ వ్యాఖ్యానించారు. మంత్రిగా పనిచేసినా కనీస జ్ఞానం కూడా లేదని దుయ్యబట్టారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని ఆరోపించారు.

11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు అప్పులు చేసిందని కేటీఆర్ విమర్శలు చేయడంలో వాస్తవం లేదన్నారు. సంక్షేమం అమలు కోసం కేవలం రూ. 52 వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని పేర్కొన్నారు. పదేళ్ల అధికారంలో చేసిన అప్పుల చిట్టాను ప్రజలకు ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ఆయన నిలదీశారు.