calender_icon.png 9 June, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోయినా పొలాల్ని పోనియ్యం..!

06-06-2025 12:15:18 AM

ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణ బాధిత రైతుల ఆవేదన 

అచ్చంపేట జూన్ 5:  నాగర్ కర్నూల్ జి ల్లా అచ్చంపేట పరిధిలో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణ సర్వేకు అనంతవరం గ్రామ రై తులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. గు రువారం ప్రాజెక్టు పరిధిలోని భూసేకరణ కోసం సర్వే పనులు చేపడుతుండగా బల్మూ రు మండలం అనంతవరం గ్రామ రైతులు అడ్డుకున్నారు.

గ్రామం న్యాయబద్ధంగా తమ భూముల రక్షణ కోసం కోర్టుమెట్లక్కామని విచారణ పూర్తయ్యేదాకా సర్వే పనులు ఆపాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రె వెన్యూ అధికారులకు రైతులకు కొద్దిసేపు వావివాదం చోటు చేసుకోగా పోలీసులు క లగజేసుకొని రైతులకు నచ్చచెప్పారు. దీంతో ఎవరికి వారు వారి వారి పొలాల్లోనే ఉం టూ సర్వే చేయొద్దని వేడుకున్నారు. ప్రాణా లు పోయినా సరే తమ భూములను వదిలిపెట్టేది లేదంటూ స్పష్టం చేశారు.

విత్తనాలు వేసే కీలక సమయంలో పోలీసు బలగాలతో సహా సర్వేకు రావడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారమూ లేకుండా భూముల్లోకి ప్రవేశించడం తప్పని, ఇది మౌలిక హక్కుల ఉల్లంఘన అని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంటలు పండే భూమిని బలవంతంగా తీసుకోవడం అన్యాయమని ఆవేదనవ్యక్తంచేశారు