06-06-2025 12:14:03 AM
ఒంటెద్దు నరసింహారెడ్డి
మఠంపల్లి జూన్ 5: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, బంగారమ్మ, పెద్దమ్మ, పోతురాజుల, ఇంద్రవెల్లి ముత్యాలమ్మ, లింగమంతుల స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కే ఎల్ ఎన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు దాసరి వెంకటరమణ,పెదవీడు బిఆర్ఎస్ నాయకులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు