20-06-2025 12:36:18 AM
చిత్రపటాన్ని బొమ్మగా చేసి క్షుద్ర పూజలు చేసిన వైనం
కొద్ది రోజులకే అనారోగ్యంతో కొడుకు ఆసుపత్రి పాలు
భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నాగర్ కర్నూల్ జూన్ 19 (విజయక్రాంతి) నాగర్ కర్నూ ల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకు పెళ్లి తర్వాత మారిపోయాడనే సాకుతో ఆ తల్లి ఓబొమ్మను తయారు చేసి కొడుకు చిత్రపటాన్ని ఉం చి క్షుద్ర పూజలకు పాల్పడింది. తన కుమారుడు కొద్ది రోజులకే అనారోగ్య సమస్యలు రావడంతో తన తల్లి తనపై క్షుద్ర పూజలకు పాల్పడిందని పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళితే గ్రామా నికి చెందిన బాలయ్య బారెమ్మలకు కురుమూర్తి, శ్రీశైలం ఇద్దరు కుమారులు, కూతురు చెన్నమ్మ ఉన్నారు. కాగా కూతురికి వివాహం జరిపించి బాగ పరిష్కారం కూడా జరిపారు. అనంతరం కురుమూర్తి పెద్ద కుమారుడికి వివాహం జరిపించిన నాటి నుంచి తల్లి చెప్పినట్లుగా వినడం లేదని తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో చెరువులో అనుమానాస్పదంగా కనిపించిన ఒక సంచిని గ్రామ స్తులు గురువారం బయటికి తీసారు.
అందులో కొబ్బరి పీచు, పెళ్ళికి వాడిన బట్టలతో తయారు చేసిన బొమ్మలకు గ్రామానికి చెందిన కురుమూర్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తయారు చేసిన బొమ్మలకు గుండు సూదులు గుచ్చి ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా గ్రామస్తులు కంగుతున్నారు.
కురుమూర్తి ని వారి కుటుంబ సభ్యులను పిలవగా కురుమూర్తి తల్లి భాగ్యమ్మ, తమ్ముడు శ్రీశైలం, చెల్లెలు చిన్నమ్మలు ఘటనస్థలికే రాకుండా పరారయ్యారు. దీంతో తనపై కక్ష కట్టి తన తల్లి తమ్ముడు చెల్లెలు కలిసి క్షుద్ర పూజలకు పాల్పడినట్లు బాధితుడు కురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుప్రారంభించారు.