01-02-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): జనవరి 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్య హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 23న రాత్రి కారులో పారిపోతున్న స్మగ్లర్లను అడ్డుకునే ప్రయత్నంలో.. కారును ఆపాలంటూ వెళ్లిన కానిస్టేబుల్ను సౌమ్యను ఢీకొట్టి పరారయ్యారు.
దీంతో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిమ్స్కు తరలించి చికిత్స అందించారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రత్యేక వైద్యుల బృం దం నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించింది. మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందం ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఆమెను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. శనివారం రాత్రి 9:41 గంటలకు సౌమ్య మరణించినట్లు నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నక్షుని భాస్కర్ ప్రకటించారు.