calender_icon.png 10 June, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాఖలపై కసరత్తు

10-06-2025 01:46:54 AM

  1. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
  2. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశం

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌కు మంత్రిత్వశాఖల కేటాయింపుపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అలాగే మూడు మంత్రి పదవుల భర్తీ, ప్రభుత్వ చీఫ్ విప్, రెండు విప్ పదవులు, పీసీసీ కార్యవర్గ కూర్పు, కార్పొరేషన్ పదవుల పంపకాలపైనా సుమారు గంటపాటు మంతనాలు జరిపారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను సీఎం వివరించినట్లు తెలిసింది. అనంతరం కేసీ వేణు గోపాల్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థాని క సంస్థల ఎన్నికల సన్నద్ధంపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మంత్రిత్వ శాఖల విషయంలో సీఎం వద్ద ఉన్న కొ న్నిశాఖలను మాత్రమే కొత్తవారికి అప్పగిస్తా రా?  లేదంటే సీనియర్ మంత్రుల వద్ద ఉన్న శాఖలను ఇతరులకు బదిలీ చేస్తారా? లేదం టే మొత్తంగా.. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తా రా..? అనే అంశాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నది.

  సీఎం మరోవైపు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తే బాగుంటుందని, ఆయా సభలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వి చ్చేస్తే బాగుంటుందని కేసీ వేణుగోపాల్‌ను కోరినట్లు తెలుస్తున్నది. సీఎం అలాగే మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖ ర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

గ్రేడింగ్ ఆధారంగా శాఖల కేటాయింపు..?

మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి నివేదికలతో ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కొందరు మంత్రుల వద్ద రెండు, మూడు శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరు.. ఎంత సమర్థంగా పని చేస్తున్నారు? ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు? అంశాలను బేరీజు వేసుకుని మరీ సీఎం పార్టీ పెద్దలకు వివరిస్తారని తెలిసింది. ముఖ్యంగా సీనియర్ మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 16 నెలల  కాలంలో మంత్రుల పనితీరుపై నిర్ణయించిన గ్రేడింగ్ ఆధారంగానూ శాఖల కేటాయింపు ఉంటుందని సమాచారం. 

భట్టికి హోంశాఖ..? శ్రీధర్ బాబుకు ఆర్థికశాఖ..?

మంత్రిత్వశాఖల కేటాయింపులో భాగం గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోం శాఖ అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. భట్టికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నందున ఆయన హోంశాఖను సమర్థం గా నిర్వహిస్తారనే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. అలాగే  ప్రస్తుతం ఐటీ, పరిశ్రమలశాఖలు నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజాగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహ రికి మున్సిపల్ శాఖ, పశుసంవర్థక శాఖ, అ డ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్‌కు కార్మిక, విద్యాశాఖలు అ ప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద ఉన్న  పౌరసరఫరాలశాఖ మార్పు గురించి కూడా చర్చి స్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోం శాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్ధక, మైనింగ్ తదితర శాఖలు ఉన్నాయి. వీటి లో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయిం చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒకటి, రెండు రోజుల్లోనే  మంత్రిత్వశాఖల కే టాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.