10-06-2025 01:25:46 AM
- మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిస్తాం
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
- మహిళల అభ్యున్నతి కోసమే ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’
- ‘సీత’ యాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణ మహిళా సాధికారత సాధించి తీరుతామని, దానిని మాటల్లో కాకుండా.. చేతల్లో చేసి చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.
‘షీ జాబ్స్’ ఆధ్వర్యంలో రూ పొందించిన ‘సీత (షీ ఈజ్ ది హీరో ఆల్వే స్)’ యాప్ను సోమవారం ఆయన హైదరాబాద్లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్ర తి కుటుంబంలో మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మహిళా సాధికా రత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర గణాంకాలశాఖ తాజా నివేదిక ప్రకా రం.. తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం, పట్టణాల్లో 89 శాతం మంది మహిళలు భాగస్వామ్యమవుతున్నారని తేలిందన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలనేది తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసమే ప్రతిష్ఠాత్మకంగా ‘ఇందిరా మహిళా శక్తి మిషన్’కు శ్రీకారం చుట్టామని, తద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సం ఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. స్వ యం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వ స్తువులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. స్కూల్ యూనిఫాం కుట్టు పనుల ద్వారా మహిళా సంఘాలకు యేటా రూ.80 కోట్ల విలువైన పనులు అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యా లయాలు, పర్యాటక ప్రదేశాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల ఆర్థికా భివృద్ధి కోసం ఒక్క ఏడాదిలోనే రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వివరించారు.
ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల నిర్వహణకు చమురు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. 16 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, డీఎస్సీ ద్వారా 10 వేల మందికి ఉపాధ్యాయ పోస్టింగ్స్ ఇచ్చామని, ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని, తద్వారా ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు.
విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చాలనే సంకల్పంతో రూ.11,600 కోట్ల అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. ‘సీత’ యాప్ ద్వారా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవచ్చన్నారు. మహిళలు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి శ్రీలీల, సినీ దర్శఖుడు హరీశ్శంకర్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి, షీ జాబ్స్ నిర్వాహకురాలు స్వాతి పాల్గొన్నారు.