31 March, 2026 | 5:41 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

కొమురం భీం వర్ధంతికి పెద్దఎత్తున తరలిరావాలి

04-10-2025 09:24 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీం 85వ వర్ధంతిని ఈ నెల 7న జోడేఘాట్ లో నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో శనివారం  కొమురం భీం మనవడు కొమురం సోనేరావు తో కాలిసి కొమరం భీం వర్ధంతి గిరిజన ఉత్సవాల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సెద్మకి ఆనంద్ రావు, తదితరులు ఉన్నారు.