తెలుగు సబ్జెక్టు తప్పనిసరి నిబంధన పొడిగింపు
08-12-2024 02:13 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పాఠశాల విద్యలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి అమలు నిబంధనను పొడిగించారు. ఈ విద్యాసంవత్సరానికి 9, 10వ తరగతిలో తెలుగు తప్పనిసరిగా అమలు చేయడంతోపాటు 2025 విద్యాసంవత్సరానికి పదో తరగతిలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గత ప్రభుత్వం పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఆయా పాఠశాలలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రతీ సారి తెలుగు తప్పనిసరి అమలు నిబంధనను పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది.




