18-05-2025 12:35:49 AM
-మా స్వార్థం కోసం చట్టం తేలేదు..
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
-మెదక్, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో సదస్సులు
మెదక్, మే 17 (విజయక్రాంతి)/కొండాపూర్/జగిత్యాల అర్బన్: తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం రైతులు మెచ్చిన చట్టమని, రైతులందరీ అభిప్రాయం సేకరించిన తర్వాతే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, తమ స్వార్థం కో సం తేలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం ఆయన మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం శీలంపల్లి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రం, జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ చట్టం ద్వారా భూమి ఉన్న ప్రతి వ్యక్తికి భూ ధార్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో రైతులకు డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాపీ కూడా అం దించి జమాబంది కార్యక్రమాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వం ప్రైవేట్, ఫారెస్టు, రెవెన్యూ, దేవాలయాలకు సంబంధించిన కొన్ని భూ తగాదాలున్న మాట వాస్తవమని, వాటిని ప్రత్యక్షంగా సర్వే చేసి శాశ్వతంగా ఆ భూములకు పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూ భారతిలో అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, నిర్లక్ష్యం వహించినా ఈ చట్టంలో ప్రొహిబిషన్ ఏర్పా టు చేశామని, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతు బాధలు తీరుతాయి: మంత్రి దామోదర
భూ భారతి చట్టంతో రైతుల బాధలు తీరుతాయని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. భూ భారతి రైతుల శ్రే యస్సు కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిలప్చెడ్లో మెదక్ ఎం పీ రఘునందన్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, కొండాపూర్లో జహీరాబాద్ ఎంపీ సురే ష్షె ట్కార్, కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, నా రాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫ హీం, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు, ఆవుల రాజి రెడ్డి, బుగ్గారంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.