6 June, 2026 | 11:28 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

అధికారులను గదిలో నిర్బంధించిన సోయా రైతులు

01-01-2026 03:16 PM

మార్కెట్ అధికారులను గదిలో నిర్భందం

బోథ్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన 

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ( Both market yard) యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. సోయా రైతులు మార్కెట్ అధికారులను గదిలో వేసి నిర్బంధించారు. వ్యవసాయ మార్కెట్ లో సోయా పంటను కొనటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ డీఎం, డీసీవో మోహన్ ను గదిలో ఉంచి రైతులు తాళం వేశారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నిర్దేశించిన నిబంధనల కారణంగా తమ ఉత్పత్తులను విక్రయించడంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నామని సోయాబీన్ రైతులు తెలిపారు. ప్రభుత్వం పరిమితులు లేకుండా సోయాబీన్‌లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు నిరసన తెలిపారు. సోయా పంటను కొనుగోలు చేయాలి డిమాండ్ చేశారు.