12-06-2025 10:45:15 PM
కోదాడ: భూభారతి రెవెన్యూ సదస్సులని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ వాజిద్ అలీ(Tehsildar Wajid Ali) అన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామం మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుండి దరఖాస్తుల స్వీకరించారు. వివిధ రకాల సమస్యలు తెలుపుతూ 100 మంది రైతులు దరఖాస్తులు చేసినట్లు తహసిల్దార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మందలపు శేషు, శెట్టి పూర్ణచంద్రరావు, రామకృష్ణ,ఆర్ఐలు రాజేష్, జగదీష్ పాల్గొన్నారు.