26-06-2025 01:01:28 AM
కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు, జూన్ 25 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం మండలాల రైతులకు రైతు భరో సా నిధులు అకౌంట్లలో జమ కావడంతో మండల కేంద్రం జిన్నారంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు బుధవారం సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి కాట శ్రీనివాస్ గౌడ్ పాలాభిషేకం చేశారు.
మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేశ్, వీరారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు వడ్డె క్రిష్ణ,చంద్రారెడ్డి, సురభినాగేందర్ గౌడ్, బొంతపల్లి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నర్సింగ్ రావు, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరేష్, నరేందర్ గౌడ్, నియోజవకర్గ, జిన్నారం, గుమ్మడిదల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.