calender_icon.png 26 June, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన నీలిమ

26-06-2025 01:01:22 AM

సనత్ నగర్, జూన్ 25( విజయ క్రాంతి): బోనాల పండగ నేపథ్యంలో బుధవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సందర్శించారు. ఈ సందర్భంగా జులై 1న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, రథోత్సవం తెలంగాణ సంప్ర దాయాన్ని చాటేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ముందుగా ఎల్లమ్మ అమ్మవా రిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంత రం.. భక్తులతో మమేకమై క్యూలైన్ సమస్యలను.. దర్శనానికి పడుతున్న సమయం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన పూజా రులతో సమావేశమై పూజా విధానాలపై చర్చించారు. పోచంపల్లి పట్టువ స్త్రాల తయారీని వీక్షించారు.

వస్త్రాల తయారీకి ముం దుకొచ్చిన పద్మశాలిలను ఆమె అభినందించారు.కాంగ్రెస్ పాలనలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతోందని.. బల్కంపేట ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటా యించిందని పేర్కొన్నారు. డాక్టర్ కోట నీలిమ వెంట ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మగ్గం జయరాజ్, మిర్యాల నవీన్ రాజ్, కొమ్ము రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, గోదాస్ నవీన్ పాల్గొన్నారు.