4 May, 2026 | 4:14 PM

Breaking News

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!   •   మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •  

ఎన్‌హెచ్‌పై ఘోర ప్రమాదం

27-07-2025 12:31 AM

- ఇద్దరు ఏపీ డీఎస్పీలు మృతి

- యాదాద్రి జిల్లాలో ఘటన

యాదాద్రి భువనగిరి, జూలై 26 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద శనివారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు.

ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్‌రావు, శాంతారావు శనివారం తెల్లవారుజామున 5 గంటలకు కారులో హైదరాబాదుకు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్, గన్‌మన్లను హైదరాబాద్ ప్రైవేట్  ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, హైదరాబాదు ట్రాఫిక్ డీసీపీ మనోహర్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు.