15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

01-12-2025 01:47 AM

-ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ

-11 మంది మృతి.. 40 మందికి గాయాలు

-మృతుల్లో 9 మంది మహిళలు

-తిరుపత్తూరు సమీపంలో ఘటన

చెన్నై, నవంబర్ 30: తమిళనాడులో ఆదివారం ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని తిరుపత్తూరు సమీపంలో ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక బస్సు కరైకుడి వైపు, మరొకటి మధురై వైపు వెళుతుండగా తిరుపత్తూరు సమీపంలోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంతో 11 మంది మృతిచెందిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. వాహనాల్లో చిక్కుకున్నారని, వారిని స్థానికులు, అత్యవసర బృందాలు బయటకు తీశారు. క్షతగాత్రులను శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపత్తూరు ప్రాంతంలోని పిళ్ళైయార్పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించామని చేశామని పేర్కొన్నారు.