6 May, 2026 | 11:57 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం

22-01-2025 06:40 PM

మహారాష్ట్ర,(విజయక్రాంతి): జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్(Pushpak Express)లో మంటలు చెలరేగాయని పుకార్లు వినిపించాయి. దీంతో రైలులోని ప్రయాణికులు ప్రాణ భయంతో ట్రైన్ చైన్ లాగి ఆపేశారు. అనంతరం ట్రాక్ మీదకు దిగి పట్టాలు దాటుతున్న సమయంలో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్(Karnataka Express) రైలు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి గాయలయ్యాయి.  ఈ దుర్ఘటన జల్‌గావ్‌లోని పరండా స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రయాణికులు, స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్య్కూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక చర్యలను నిర్వహించారు. గాయపడిన ప్రయాణికులను వైద్య చికిత్స కోసం సమీపంలోని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.