14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

చిన్ననీటి పారుదల సర్వే పకడ్బందీగా చేయాలి

10-11-2025 05:21 PM

శాఖల అధికారులు సమన్వయంతో పని చేయండి

శనివారంలోగా శిక్షణ పూర్తి చేయాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వే పై డీఆర్డీఓ, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీఓ తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల సర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వేల హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న జల వనరుల సర్వే మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఛార్జ్ ఆఫీసర్ గా తహసిల్దార్, ఎంపీఎస్ఓ, నీటిపారుదల శాఖ ఏఈలు సూపర్వైజర్ గా ఉంటారని, జీపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈఓలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు. 

జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు ఇతర జల వనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమరేటర్లకు ఆయా తహసీల్ కార్యాలయాల్లో తహసిల్దార్, ఎంపీఎస్ఓ, నీటిపారుదల శాఖ ఏఈలు, ఎంపీడీఓలు ఈ సర్వేపై శనివారంలోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ ఇతర శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన వివరాలను సర్వే చేస్తున్న అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి, డీఆర్డీఓ శేషాద్రి, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.