30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

10-11-2025 05:35 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. సోమవారం మండల కేంద్రంలోని  విద్య వనరుల  కేంద్రంలో మండల విద్యాధికారి శ్రీదేవి సమక్షంలో ఉత్తమ ఉపాధ్యాయులకు  అవార్డులను  ప్రధానం చేశారు.  విద్యార్థుల సంఖ్యను పెంచిన ఉపాధ్యాయులను, అందరినీ సమన్వయం చేస్తూ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తూ, విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను 12 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో  అశోక్ కుమార్, వేణుగోపాల్, దేవ్, మోహన్, బొజ్య నాయక్, అనిల్ కుమార్, రఘునందన్, సంపత్, భగవాన్ రెడ్డి, సత్యనారాయణ, వరప్రసాద్, రాజేశ్వరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  సోమలింగం, సునీల్, శైలజ,  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, సుదర్శన్, సురేష్ పాల్గొన్నారు.