05-05-2025 12:00:00 AM
ఫీచర సునీతారావు 2024కుగాను చతుర్థ వార్షిక పురస్కారాల కోసం కవిత్వంలో తండా హరీశ్ గౌడ్ ‘గాలి లేని చోట’, విమర్శలో ఎం.దేవేంద్ర ‘తెలంగాణ కథL వర్తమాన జీవన చిత్రణ’, కథా విభాగంలో పిన్నంశెట్టి కిషన్ ‘లేంబాళ వాటిక కథలు’, జెండా సుబ్బారావు ‘మంచు కింద ఉక్కపోత’ ఎంపిక అయ్యారు.
కవిత్వ విభాగానికి న్యాయ నిర్ణేతలుగా కటుకోజ్వల ఆనంద చారి, డాక్టర్ చమన్ సింగ్, కథా విభాగానికి న్యాయ నిర్ణేతలుగా గుడిపాటి వెంకటేశ్వరరావు, తిరునగరి దేవకీదేవి, విమర్శకు న్యాయ నిర్ణేత లుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బెల్లంకొండ సంపత్కుమార్ వ్యవహరించారు.
ఈ పురస్కారాల ప్రదానం ఈ నెల 10-న హైదరాబాద్, రవీంద్రభారతిలో జరుగుతుందని పురస్కారాల కమిటీ కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, పురస్కారాల ఫౌండేషన్ చైర్మన్, ఫీచర విజయేందర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.