1 May, 2026 | 9:24 PM

విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజులు జమ.. ప్రభుత్వ నిర్ణయం– అభినందనీయం

01-05-2026 08:10 PM

బీసీ సంఘం నేత రాజ్ కుమార్

తాండూరు,(విజయక్రాంతి): విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలన్న ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వికారాబాద్ జిల్లా తాండూరు బీసీ సంఘం నేత కందుకూరి రాజ్ కుమార్ స్వాగతించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యానికి రెండింటికీ మేలు జరుగుతుందని.. విద్యార్థులకు నేరుగా లబ్ధి చేరడమే కాకుండా, కాలేజీ యాజమాన్యాలకు కూడా సకాలంలో ఫీజులు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు మధ్యవర్తిత్వం, ఆలస్యం వంటి సమస్యలు ఉండేవని, ఈ కొత్త విధానం వల్ల అవి గణనీయంగా తగ్గుతాయని . దీంతో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.