24-06-2025 12:36:37 AM
నిర్మల్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది అర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అం దాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు ఎన్ని ప రిష్కారం అయ్యాయని మరియు పెం డింగ్ పిర్యాదుల పురోగతిని గురించి నిర్మల్ ఏఎస్పీ రాజేష్మీన ఐపీఎస్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, పట్టణ ఇన్స్స్పెక్టర్ ప్రవీణ్, డీసీఆర్బీ ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు.