12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

మహిళా ఆత్మహత్య..

15-10-2025 08:57 PM

జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లిపూర్ గ్రామం షరీనగర్ లో యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. అల్లిపూర్ కు చెందిన గొల్ల స్వప్న గుజ్జువాడ గ్రామానికి చెందిన శంకర్కు అప్పుగా నాలుగు లక్షలు ఇచ్చింది. అప్పు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని శంకర్కు కోరగా శంకర్ ససేమిరా అంటూ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వనంటూ తెలపడంతో మనస్తవం చెందిన స్వప్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

స్వప్న భర్త చింతల గట్టు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. స్వప్న దిగ్వాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన మనీ ట్రాన్స్ఫర్ ఇన్ తోపాటు జిరాక్స్ ఎంబ్రాయిడరీ పన్ను నిర్వహిస్తుంది. స్వప్న తల్లిదండ్రులది చింతల గట్టు గ్రామం కాగా ఆమెను కోహిర్ మండలం వెంకటపూర్ గ్రామానికి ఇచ్చారు. భర్త ఏంఆర్ఎఫ్ ఉద్యోగి కావడంతో జహీరాబాద్ లో నివాసం ఉంటున్నారు.