23 June, 2026 | 1:32 AM

ఎరువుల ధరలను తక్షణమే నియంత్రించాలి

23-06-2026 12:00 AM

అశ్వారావుపేట, జూన్ 22 (విజయ క్రాంతి): రైతులు వినియోగించే ఎరువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశా రు. సిపిఐ ,అఖిల భారత కిసాన్ సంఘం పిలుపులో భాగంగా  సోమవారం అశ్వరావుపేట  లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ అశ్వరావుపేట మండల సమితి, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా లో పెంచిన ఎరువుల ధరలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలను వెంటనే నియంత్రిం చాలని, రైతు బంధును ఓకే దఫాగా జూన్ 30 తారీకు  కల్లా రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

యూరియా యాప్ రద్దు చేయాలని, నకిలీ విత్తనాలు, పుగుల మందులు అమ్మే దళారీలపై పి.డి యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వివిధ డిమాండ్లతో కూడిన మెమోరాండంను అశ్వరావుపేట తహసీల్దార్ గారికి సమర్పించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లను పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం తెలియజేసినారు.  సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,రైతు సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.