calender_icon.png 4 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి పండుగకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఆర్థిక సాయం

01-06-2025 12:14:01 AM

కడ్తాల్, మే 31 : కడ్తాల్  మండలం ముద్విన్ గ్రామపంచాయతీ పరిధిలోని కోర్షకొండ తండాలో బొడ్రాయి పండగకు బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం  రూ. 45 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ రూ. 25వేలు, కడ్తాల్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ రూ. 10వేలు, మైసిగండి మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్ రూ. 5వేలు, ఉపసర్పంచ్ పాండు 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య, డైరెక్టర్ వెంకటయ్య, మార్కెట్ మాజీ డైరక్టర్ లాయక్ ఆలీ, జంగయ్య, రాజు నాయక్ మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.