calender_icon.png 24 June, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

07-06-2025 08:02:38 PM

కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు మండలంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళ ఎస్ఐ హరిత(SI Haritha)పై పదిమంది యువకులు దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి కల్లూరు మండలం(Kallur Mandal) తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద గల చౌదరి భోజనం హోటల్ లో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన 11 మంది యువకులు ఆ రాత్రి హోటల్ వద్దకు వచ్చి పరోటాలు కావాలని కోరారు. అయితే అప్పటికే ఇంకా పరోటాలు చేయలేదని హోటల్ సిబ్బంది తెలిపినందుకు ఆగ్రహంతో యువకులు హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ ఘర్షణకు దిగారు.

ఈ ఘటనను గమనించిన హోటల్ యాజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించటంతో పాటు హోటల్ యజమాని అయిన మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబరు 102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 బి యన్ యస్ కేసు నమోదు చేసి, అట్టి కేసు విచారణ నిమిత్తం ఘటన ప్రాంతానికి ఎస్సై వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రాయల రామారావు, తన అనుచరులతో మరల హోటల్ వద్దకు వచ్చి సాక్ష్యాలుగా ఉన్న హోటల్ సిబ్బందిని, యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు అనే సమాచారంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్ళిగా ఎస్సై ఎదురుగానే రాయల రామారావు(రాము)తో పాటు అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని గమనించిన పోలీస్ సిబ్బంది వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సై వారిని పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాయల రామారావు (రాము), అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని తెలిపారు.

ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం పదిమందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందుతుడు రాయల రామారావుతో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో రాయాల రామారావుపై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు.

ఘటనపై ప్రజా సంఘాల ఆగ్రహం

ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొంటూ పలువురు ప్రజా ప్రతినిధులు, సంఘ సంస్థలు, మహిళా సంఘాలు స్పందిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులే ఇలా దాడికి గురవుతుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా పోలీస్ అధికారులకు గౌరవం కల్పించేలా చట్టాలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విధుల్లో వున్నా ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడం, మహిళా అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించడం, మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం తో పాటు అసభ్య పదజాలం ఉపయోగించిన ఆ యువకులపై బిఎన్ఎస్ చట్టం ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం మత్తులో దుర్మార్గంగా ప్రవర్తించే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.